'నేను రాజకీయాల్లో బిజీగా ఉండిపోవడం మూడు సినిమాలు ఆగిపోయాయి, నావల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక వీరమల్లు సినిమాది మరో పరిస్థితి. ఏకంగా ఐదేళ్లుగా నిర్మాణం కొనసాగుతోంది. అందువల్ల ఏఎం రత్నం చాలా కష్టాల పడ్డారు. ఆయన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రమోషన్లలో పాల్గొంటున్నా. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం. ముందు రిలీజ్ చేయాలి. ఆడాలి.. ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందన్న నమ్మకం నాకుంది' అన్నారు పవన్.
* ఏం కావాలంటే అది చేస్కోండి.. 'వీరమల్లు' బాయ్కాట్ ట్రెండ్పై పవన్ రియాక్షన్
'ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. అందువల్ల ఇకపై నేను సినిమాల్లో నటించే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే సినిమాలే నాకు ఇంధనం లాంటివి. అందువల్ల నిర్మాతగా మారి సినిమాలు నిర్మించే ఆలోచన ఉంది. సినిమాల్లో నటించాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైమ్ కేటాయించలేను. అందువల్లో ప్రొడక్షన్ చేస్తే సినిమాలతో బంధం కొనసాగించినట్లు అవుతుంది. డబ్బులూ వస్తాయి. నాకు వేరే వ్యాపారాలు లేవు కాబట్టి సినిమాలే దిక్కు. హీరోగా కాకపోయినా నిర్మాతగా నా సినిమాలు వస్తుంటాయి. ఉస్తాద్ భగత్సింగ్ సినిమా కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి రాజకీయాల్లో బిజీ అయిపోతా. అప్పట్లో హిందువులపై ఔరంగజేబు హిందువులపై సాగించిన హింసాకాండ చుట్టూ తిరుగుతుంది. ఇందులో నేను కోహినూర్ వజ్రాన్ని సాధించే పోరాటయోధుడిగా కనిపిస్తా' అని చెప్పారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. తమ హీరో ఇకపై నటించడని తెలిసి బాధపడుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించనని, తన ఆఖరి సినిమా నటించేశానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన మనసు మార్చుకుని వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు', ఓజీ, ఉస్తాద్ భగత్సింగ్ ప్రాజెక్టులు అంగీకరించారు. దీన్నిబట్టి పవన్ మళ్లీ మనసు మార్చుకుని కచ్చితంగా నటిస్తారని కొందరు అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి మాట మార్చడం అలవాటేనని, గతంలోనూ ఇలాంటి స్టేట్మెంట్లు చాలానే చూశామని సెటైర్లు వేస్తున్నారు.